News February 4, 2025

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన కలెక్టర్

image

నంద్యాల మండలం పాండురంగాపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం గ్రామంలోని మధుసూదన్ రెడ్డి, కేశవ్ రెడ్డి పొలాలను పరిశీలించి, వారు అవలంభిస్తున్న విధానాలను సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి, వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ రసాయన రహిత సాగుతో వచ్చిన లాభాలను కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News February 5, 2025

ప్రణబ్ మెమోరియల్ పక్కనే మన్మోహన్ స్మారకానికి స్థలం?

image

మాజీ PM, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్‌ కోసం కేంద్రం ఢిల్లీలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్ ఘాట్‌ కాంప్లెక్స్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం పక్కనే ల్యాండ్‌ను ఇస్తామని మన్మోహన్ కుటుంబీకులకు తెలిపినట్లు సమాచారం. వారు సమ్మతి తెలపగానే మెమోరియల్ నిర్మాణానికి రూ.25 లక్షలు అందించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది DEC 26న మన్మోహన్ మరణించిన విషయం తెలిసిందే.

News February 5, 2025

పాడేరు: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు

image

లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు, నీడ తోటల పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 20వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని, ఉపాధి హామీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News February 5, 2025

SSMB29: ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదా.. విలనా?

image

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఆమె విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్. కాగా ఈ మూవీ కోసం కాశీలో ఉండే మణికర్ణికా ఘాట్‌ తరహాలో హైదరాబాద్‌లో సెట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

error: Content is protected !!