News July 30, 2024
ప్రచారపిచ్చితో ఖజానాను జగన్ గుల్ల చేశాడు: దేవినేని

ఎన్టీఆర్: తన ప్రచారపిచ్చితో రాష్ట్ర ఖజానాను జగన్ గుల్ల చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. తన ముచ్చట తీర్చుకునేందుకు మాజీ సీఎం జగన్ రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. రీ సర్వేలో అవకతవకలు చేయడమే కాక, ప్రజల ఆస్తులపై జగన్ తన పేరు బొమ్మలు వేసుకుని అహంకారపూరితంగా వ్యవహరించాడని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
Similar News
News February 23, 2026
కృష్ణా: 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్కు ప్రణాళికలు

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు వరకు 14KM ఎలివేటెడ్ మెగా ఫ్లైఓవర్ కారిడార్ నిర్మాణానికి NH అధికారులు సానుకూలంగా స్పందించారు. బందరు రోడ్డునుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఆటంకం లేకుండా అమరావతి వైపు ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు విస్తరణ లేకుండానే 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. గంగూరు- దావులూరు ORR వరకు హైవేను 6 లైన్లుగా విస్తరిస్తారు.
News February 23, 2026
కృష్ణా: అపరాల కోతలకు కూలీల కొరత

జిల్లాలో రెండో పంటగా సాగుచేసిన అపరాల పంట కోతల దశకు చేరుకోవడంతో రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతోంది. స్థానికంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో జిల్లాకు తరలివస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంట కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కూలీలకు డిమాండ్ ఏర్పడింది.
News February 23, 2026
కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఫస్ట్ ఇయర్కు 24,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత, పర్యవేక్షణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉండనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.


