News February 12, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ సుహాసిని

బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని అన్నారు. చికెన్, గుడ్లు తినకుండా ఉండాలని, కోళ్ల ఫారాల నిర్వాహకులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం శానిటైజర్లతో చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. మాస్క్ ధరించిన తరువాత ఫారాల్లో పనులు చేయాలని సూచించారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <
News November 25, 2025
ములుగు: మండలాల వారీగా వడ్డీ లేని రుణాల పంపిణీ ఇలా..!

రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ములుగు జిల్లాలో రూ.2.7కోట్లను మహిళా పొదుపు సంఘాలకు ఈరోజు అందజేసింది. ఏటూరునాగారంలో రూ.21.89లక్షలు, గోవిందరావుపేటలో రూ.28.46లక్షలు, కన్నాయిగూడెంలో రూ.3.58లక్షలు, మంగపేటలో రూ.49.74, ములుగులో రూ.59.65లక్షలు, తాడ్వాయిలో రూ.5.19 వెంకటాపూర్లో రూ.21.84లక్షలు, వాజేడులో రూ.2.81లక్షలు, వెంకటాపురంలో రూ.13.84 లక్షల రుణాలు ఇచ్చారు.


