News December 12, 2024

ప్ర‌జ‌లంద‌రూ సోద‌ర భావంతో జీవించాలి: మాజీ ఎంపీ టీజీ

image

కుల‌, మ‌త బేధాలు లేకుండా ప్ర‌జ‌లంద‌రూ సోద‌ర భావంతో జీవించాల‌ని మాజీ రాజ్య‌స‌భ‌ స‌భ్యులు టీజీ వెంక‌టేశ్ అన్నారు. కర్నూలులోని మౌర్య ఇన్‌లో మంత్రి టీజీ భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో పాస్ట‌ర్‌ల‌కు ఏర్పాటు చేసిన‌ క్రిస్మ‌స్ క్యాండిల్ లైట్ స‌ర్వీస్ కార్య‌క్ర‌మంలో వెంక‌టేశ్ పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కర్నూలు నగరం నిలుస్తోందని ఆయన అన్నారు.

Similar News

News January 17, 2025

BREAKING: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

image

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాలకుర్తి వద్ద లారీ టైర్ పేలి కారుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 17, 2025

కర్నూలుకు పెట్టుబడుల క్యూ.. కారణమిదే!

image

☞ ఓర్వకల్లు విమానాశ్రయం ఉండటం
☞ ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో అందుబాటులో భూమి
☞ హైదరాబాద్‌- బెంగళూరు నగరాలకు మెరుగైన రవాణా సౌకర్యం
☞ సీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం
☞ నీటి వనరుల అనుకూలం
☞ సంస్థలకు త్వరితగతిన అనుమతులు
☞ ఓర్వకల్లు విమానాశ్రయంలోని రన్‌వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకునే అవకాశం
☞ కర్నూలు ఎమ్మెల్యే పరిశ్రమల శాఖ <<15167493>>మంత్రిగా<<>> ఉండటం

News January 17, 2025

ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,632

image

ఆదోని మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,632 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 1,785 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,632, సరాసరి రూ.7,389, కనిష్ఠ ధర రూ.5,580తో అమ్మకాలు జరిగాయి.