News April 15, 2025
ప్రజలకు అండగా ఉంటా: గద్వాల ఎమ్మెల్యే

పేద ప్రజలకు అండగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీదొడ్డి మండలానికి చెందిన మంజులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీద అందజేశారు.. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
నా ఓరుగల్లు.. కాకతీయులు ఏలిన నేల!

కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డపై పుట్టిన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ నేలను మర్చిపోరు. ఈ నేలపై ఓరుగల్లు ప్రజలు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఎక్కడ కలుసుకున్నా జిల్లా బంధం ఇట్టే కలిపేస్తుంది. ఎక్కడున్నా ఓరుగల్లు భాష దగ్గరికి చేరుస్తుంది. అంతేకాదు.. ఓరుగల్లును, పంట భూములను భద్రకాళి, సమ్మక్క-సారలమ్మ, రుద్రేశ్వర స్వామి వార్లే కాపాడతారని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నేడు ప్రపంచ నేల దినోత్సం. SHARE
News December 5, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 5, 2025
నల్గొండ: కబడ్డీ అసోసియేషన్లో లుకలుకలు!

నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్లో లుకలుకలు బయటపడ్డాయి. కబడ్డీ అసోసియేషన్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగి పెత్తనం చెలాయించడంపై అసోసియేషన్ మండిపడుతోంది. జిల్లా కమిటీ సభ్యులకు తెలియకుండానే జిల్లా కబడ్డీ అసోసియేషన్ పేరుతో ఈనెల 2, 3, 4వ తేదీల్లో హాలియాలో 51వ అంతర్ జిల్లాల బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. హాలియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు కబడ్డీ అసోసియేషన్తో సంబంధం లేదని సభ్యులు తెలిపారు.


