News February 10, 2025
ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News November 13, 2025
నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడికి ఇచ్చేందుకు విజయవాడ కోర్ట్ బుధవారం అనుమతి ఇచ్చింది. వారంపాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యగా… కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను 13,14 తేదీల్లో విచారించేందుకు సూర్యారావు పేట పోలీసులు తీసుకెళ్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు ఆమెపై కేసు నమోదు అయింది.
News November 13, 2025
నెల్లూరు ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 65 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. చుట్టు పక్కల వారు గుర్తించి హాస్పిటల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440700018, 08612328440 నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు కోరారు.
News November 13, 2025
వారికి రూ.90 కోట్ల మంజూరు: అబ్దుల్ అజీజ్

నెల్లూరు: ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందన్నారు. చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధతతోనే ముస్లింల అభివృద్ధి జరుగుతుందన్నారు.


