News February 11, 2025

ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్‌ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News February 11, 2025

నెల్లూరు: తల్లిని కాపాడబోయి వాగులో మునిగి యువకుడి మృతి

image

అనంతసాగరం మండలం శంకర్ నగరం గ్రామం వద్ద కొమ్మలేరు వాగులో మునిగి ఉప్పలపాటి ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. వాగు సమీపంలో గడ్డి కోసేందుకు వెళ్లిన తల్లి వాగులో పడిపోగా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి వాగులో మునిగి ఆకాశ్ మృతి చెందాడు. కళ్లముందే కొడుకు వాగులో మునిగి చనిపోవడంతో తల్లి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీటెక్ చదివిన ఆకాశ్ మృతి చెందడంతో శంకర్ నగరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 11, 2025

మోసపూరిత SMSలపై అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

image

వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు SP జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

News February 10, 2025

కందుకూరు: ఉచితంగా రూ.45 వేల ఇంజెక్షన్

image

గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డా. తులసిరామ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. దీని ఖరీదు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుందని, కానీ ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

error: Content is protected !!