News February 10, 2025
ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News April 17, 2026
NLR: పెట్రోల్ బంకుల్లో ఈ సేవల గురించి తెలుసా?

ప్రతి పెట్రోల్ బంక్లో వినియోగదారులకు చాలా సేవలు అందుతాయనే విషయమే తెలియదు. మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. అత్యవసరమైతే ఫోన్ కాల్ వినియోగించుకోవచ్చు. బంకులో పెట్రోల్ డీజిల్ నాణ్యత ప్రమాణను పరిశీలించవచ్చు. వాహనాల టైర్లకు గాలి ఉచితంగా పొందవచ్చు. బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కంపల్సరీగా ఉండాలి. సేవలు కల్పించకపోతే 1800-11-4000కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
News April 17, 2026
NLR: పెట్రోల్ బంకుల్లో ఈ సేవల గురించి తెలుసా?

ప్రతి పెట్రోల్ బంక్లో వినియోగదారులకు చాలా సేవలు అందుతాయనే విషయమే తెలియదు. మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. అత్యవసరమైతే ఫోన్ కాల్ వినియోగించుకోవచ్చు. బంకులో పెట్రోల్ డీజిల్ నాణ్యత ప్రమాణను పరిశీలించవచ్చు. వాహనాల టైర్లకు గాలి ఉచితంగా పొందవచ్చు. బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కంపల్సరీగా ఉండాలి. సేవలు కల్పించకపోతే 1800-11-4000కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
News April 17, 2026
నెల్లూరు: హైస్పీడ్ బోట్ల కొనుగోలుకు ఆమోదం

సముద్రంలో గస్తీ కోసం 2 హైస్పీడ్ యాంత్రిక బోట్ల కొనుగోలుకు నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు ఆమోదం తెలిపినట్లు జేడీ శాంతకుమారి తెలిపారు. 2బోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా గస్తీ నిమిత్తం ప్రభుత్వం రూ.120 లక్షలు పూర్తి రాయితీతో అందిస్తుందన్నారు. జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను రాష్ట్రకమిటీ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. 3నెలల్లో వీటిని అందిస్తామన్నారు.


