News February 10, 2025
ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News March 28, 2025
ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్, కోటంరెడ్డి

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కస్తూరిదేవి గార్డెన్స్లో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి, కలెక్టర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
News March 28, 2025
నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.
News March 28, 2025
కాకాణి ముందస్తు బెయిల్పై హై కోర్ట్ కీలక ఆదేశాలు

తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కాకాణి పిటిషన్పై కోర్ట్.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరదాపురం పరిధిలోని ప్రభుత్వ భూమిలో కాకాణి అక్రమంగా మైనింగ్ చేశారంటూ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ నెల 16న ఆయనపై కేసు నమోదైంది. దీనిపై బెయిల్ కోరుతూ కాకాణి కోర్టుకు వెళ్లగా.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమకు సర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.