News December 25, 2024
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు ఎస్పీ

కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు గొప్ప జీవితాన్ని, ఆయన కరుణ, క్షమాపణ సందేశాన్ని, నిత్య సత్యాన్ని విలువలను నిలబెట్టడానికి ఆయన పడిన కష్టాలను ప్రజలకు గుర్తు చేస్తుందన్నారు. క్రిస్మస్ పండుగ ప్రజలందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Similar News
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.


