News March 28, 2024

ప్రజలకు చేరువ అయ్యేలా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

పోలీస్ విధులు ప్రజలకు చేరువ అయ్యేలా ఉండాలని గద్వాల SP రితిరాజ్ సూచించారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం విజిట్ చేశారు. స్టేషన్ పరిసరాలు రికార్డులు పరిశీలించారు. పనిచేయని సీసీ కెమెరాలు పునరుద్ధరించాలన్నారు. అనంతరం బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది తమ సమస్యలను ఎస్పీతో మొరపెట్టుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.

Similar News

News September 30, 2024

నల్లమలలో టైగర్ సఫారీ రెడీ

image

నల్లమలలో నేటితో మూడు మాసాల నిషేధం ముగియనుంది. రేపటి నుంచి టైగర్ సఫారీ సేవలను అటవీశాఖ పున:ప్రారంభించనుంది. పర్యాటకులు టైగర్ స్టే నల్లమల పేరుతో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం వెళ్లి వచ్చే పర్యాటకుల కోసం ఆఫ్‌లైన్‌లో పరాహాబాద్ చౌరస్తా నుంచి సఫారీ వాహన సేవలను అందిస్తోంది. ఈ వాహనాల్లో వెళ్తూ అడవి అందాలను, పెద్దపులులు, చిరుతలు, వివిధ రకాల, జంతువులు, పక్షులను ప్రత్యక్షంగా చూడొచ్చు.

News September 30, 2024

MBNR: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
MBNR: 3239 121 1:27
NGKL: 3625 125 1:29
NRPT: 2683 137 1:19
WNP: 2137 53 1:40
GDWL: 2893 72 1:40

News September 30, 2024

ఇంటర్ ప్రవేశాల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు

image

2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వనపర్తి డిఐఈఓ అంజయ్య ఆదివారం తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రూ.500 జరిమానాతో, ప్రభుత్వ కళాశాలలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ఇంటర్ లోప్రవేశం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని అన్నారు.