News March 28, 2024

ప్రజలకు చేరువ అయ్యేలా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

పోలీస్ విధులు ప్రజలకు చేరువ అయ్యేలా ఉండాలని గద్వాల SP రితిరాజ్ సూచించారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం విజిట్ చేశారు. స్టేషన్ పరిసరాలు రికార్డులు పరిశీలించారు. పనిచేయని సీసీ కెమెరాలు పునరుద్ధరించాలన్నారు. అనంతరం బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది తమ సమస్యలను ఎస్పీతో మొరపెట్టుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.

Similar News

News January 16, 2025

నాగర్ కర్నూల్: అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

image

నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌గా పి.అమరేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్‌ బాదావత్ సంతోష్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News January 16, 2025

శ్రీశైలం: స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవలు

image

శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.

News January 16, 2025

UPDATE: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

image

కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం వద్ద తిరుపతి హైవేపై బుధవారం సాయంత్రం <<15163728>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలు.. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (36), మహేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.