News March 27, 2025
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి: మంత్రి స్వామి

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్సీ, పీహెచ్సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.
Similar News
News October 15, 2025
ఒంగోలులో వ్యక్తి మిస్సింగ్.. ఎక్కడైనా చూశారా..!

ఒంగోలు పరిధిలోని శ్రీనగర్ కాలనీ ఒకటవ లైన్లో ఉండే భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి (దేవుడు) ఆదివారం మిస్ అయినట్లు ఒంగోలు తాలూకా PSలో ఫిర్యాదు అందింది. మిస్ అయిన వ్యక్తి భార్య వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం కొత్తపాలెంకి చెందిన శ్రీనివాసరెడ్డి ఒంగోలులో స్థిరపడ్డారు. కాగా ఆదివారం బ్యాంక్లో క్రాఫ్లోన్ కట్టేందుకు స్వగ్రామానికి వెళ్లున్నానని వెళ్లాడన్నారు. వివరాలు తెలిస్తే 9177688912కు కాల్ చేయాలన్నారు.
News October 15, 2025
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అంటే జాగ్రత్త.!

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసగించే అవకాశాలు ఎక్కువ అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే మంగళవారం ఓ ప్రకటనను పోలీసులు విడుదల చేశారు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలు వస్తాయని వచ్చే మెసేజ్లపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.
News October 14, 2025
SNపాడులో 17న జాబ్ మేళా..!

SNపాడులోని DMSVK మహిళా కళాశాలలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజలు తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కలెక్టర్ రాజాబాబు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. 18 నుంచి 35ఏళ్ల వయసు గల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు తెలిపారు.