News June 27, 2024
ప్రజలకు పారదర్శకమైన సేవాలందించాలి: సృజన

అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలని కలెక్టర్ సృజన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సృజనను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ కార్యవర్గ సభ్యులు గురువారం కలిశారు. గతంలో సబ్ కలెక్టర్గా పనిచేసినప్పుడు ఉద్యోగులు ఎంతగానో సహకరించారన్నారు.
Similar News
News November 24, 2025
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.
News November 24, 2025
నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News November 24, 2025
నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


