News January 25, 2025
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: ASF కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆరోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, ఔషధ నిల్వలు,రిజిస్టర్లు,పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజల పట్ల వైద్యులు మర్యాదగా వ్యవహరించాలన్నారు.
Similar News
News November 28, 2025
స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News November 28, 2025
సిరిసిల్ల: ఉపాధ్యాయురాలిగా మారిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్లలో జరిగిన ఇన్స్పైర్, విద్యా వైజ్ఞానిక సదస్సులో ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులతో మమేకమయ్యారు. సౌర విద్యుత్, పవన విద్యుత్, థర్మో డైనమిక్స్, కిరణజన్య సంయోగ క్రియ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన వచ్చేందుకు ఎగ్జిబిషన్లు దోహదపడతాయన్నారు.
News November 28, 2025
సాలూరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు: ఎస్పీ

మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను, మంత్రి అనధికార పీఏ, ఆర్థికంగా దోచుకొని, వేధింపులకు గురిచేశారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు అతనిపై సాలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ జరిపి చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.


