News March 23, 2025
ప్రజలకు విద్య, వైద్యం చాలా ముఖ్యం: శబరీష్

నేటి సమాజంలో ప్రజలకు విద్య వైద్యం ఎంతో ముఖ్యమని ములుగు ఎస్పీ శబరీష్ అన్నారు. వాజేడు మండలం కొంగాల గ్రామంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు పోలీసుల ప్రథమ కర్తవ్యం అని ఎస్పీ అన్నారు. సమాజంలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.
News October 31, 2025
ఏకత స్ఫూర్తిని నింపేందుకు 2k రన్: MHBD SP

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం 2k రన్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుంచి అండర్ బ్రిడ్జి ద్వారా ఎన్టీఆర్ స్టేడియం వరకు రన్ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యత పరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
News October 30, 2025
మిర్యాలగూడ: చివరి ధాన్యం గింజ వరకూ కొంటా: కలెక్టర్

ఈ ఖరీఫ్లో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం రైస్ మిల్లు తనిఖీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని తెలిపారు. రైస్ మిల్లర్లు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె అన్నారు.


