News March 7, 2025

ప్రజలకు సాయం చేస్తామని ధైర్యం కల్పించాలి: సీపీ

image

పోలీసులు ఉన్నారు.. మనకు సాయం చేస్తారనే ధైర్యం ప్రజలకు కల్పించాలని సీపీ అంబర్ సిబ్బందికి సూచించారు. కమిషనరేట్ పరిధిలో పిట్రొకర్, ఇంట్రెస్ట్ స్పెక్టర్, హైవే పెట్రోలింగ్ విధుల పోలీస్ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఏ విధమైన విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే సిబ్బంది స్పందించి ఫిర్యాదు వద్దకు చేరుకొని వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 18, 2025

ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

image

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.

News October 18, 2025

నేడు మద్యం, మాంసం వద్దు! ఎందుకంటే..?

image

ధన త్రయోదశి పర్వ దినాన మాంసం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదని అంటున్నారు. ‘నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. గృహోపకరణాలు దానం చేయడం, అమ్మడం వంటివి చేయకండి. నేడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా, ప్రతి చోట పరిశుభ్రత, దీపాల వెలుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది’ అని సూచిస్తున్నారు.

News October 18, 2025

మంచిర్యాల: ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

image

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లాలోని ఏర్పాటుచేసిన పలు కేంద్రాల వద్ద శుక్రవారం 433 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 263, బెల్లంపల్లి 185, లక్షెట్టిపేట 109, చెన్నూరు 98, మొత్తంగా 655 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.