News February 6, 2025
ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి: నంద్యాల కలెక్టర్

బాధ్యతలు స్వీకరించిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో అనుకూల దృక్పథం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వెల్లడించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ హాల్లో లైఫ్ కోచ్ మోటివేషన్ స్పీకర్ డాక్టర్ ఎన్.రాంబాబు స్ట్రేస్ మేనేజ్మెంట్, పాజిటివ్ థింకింగ్పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంబాబు మానసిక ఒత్తిడి, శారీరిక ఒత్తిడి తగ్గించుకునే అంశాలపై క్షుణ్ణంగా వివరించారు.
Similar News
News March 24, 2025
‘ఎల్2 ఎంపురాన్’ విడుదల.. కాలేజీకి సెలవు!

మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఎల్2 ఎంపురాన్’ విడుదలకు ముందే భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.58 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు ప్రకటించాయి. అలాగే, బెంగళూరులోని ఓ కాలేజీ యాజమాన్యం విడుదల రోజైన ఈనెల 27న సెలవు ప్రకటించి విద్యార్థులకు ఉచితంగా టికెట్లు ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
News March 24, 2025
ఆత్మకూరు: క్షణికావేశం.. తీరని శోకం..!

జూరాల ప్రాజెక్టులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక, బీజాపూర్కు చెందిన సుజయ్ కులకర్ణి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితం పెళైంది. గత శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు వచ్చి వారి నాన్నకి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
News March 24, 2025
జగిత్యాల: ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ సంస్థ ఆర్మీలో వివిధ కేటగిరీలలో ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్కు, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్ మాన్ తదితర ఉద్యోగాలు ఉన్నాయన్నారు. వయస్సు 17 నుంచి 21 మధ్య ఉండాలన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 040-27740205 నంబర్ను సంప్రదించాలన్నారు