News January 28, 2025

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా ఉండాలి: సీపీ

image

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వరంగల్‌ సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం పోలీస్‌ అధికారులతో సీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీలు, ఏఎస్పీ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

Similar News

News January 5, 2026

ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా.. జేఎన్‌యూ స్టడీ

image

ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియాను గుర్తించారు. యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని ఈ సూపర్‌బగ్ ఉన్నట్టు జేఎన్‌యూ స్టడీలో వెల్లడైంది. దేశ రాజధానిలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాలు, హాస్పిటల్స్ పరిసరాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. న్యుమోనియా, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లకు ఈ బగ్ కారణమవుతుందని తెలిపింది. WHO పరిమితికి మించి గాలిలో 16 రెట్లు అధికంగా బ్యాక్టీరియా వ్యాపించినట్టు తెలిపింది.

News January 5, 2026

కర్నూలు: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 84 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు స్వీకరించారు. మోసాలు, చీటింగ్, పంట దోపిడీ తదితర అంశాలపై పోలీసు అధికారులు తక్షణ స్పందించాలని ఆదేశించారు.

News January 5, 2026

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్

image

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సోమవారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు సందర్శించారు.
హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో వాటిని తొలగించి ఉద్యానవనంలా తయారు చేయాలని సిబ్బందికి చెప్పారు. రోగులకు అందతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.