News January 28, 2025
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా ఉండాలి: సీపీ

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం పోలీస్ అధికారులతో సీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీలు, ఏఎస్పీ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
Similar News
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
12న అన్నమయ్య జిల్లాకు CM రాక

అన్నమయ్య జిల్లాకు ఈనెల 12న సీఎం చంద్రబాబు వస్తారని సమాచారం. పేదల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనాడానికి గత నెల 29వ తేదీనే చిన్నమండెంకు సీఎం రావాల్సి ఉంది. భారీ వర్షాలతో అప్పుడు పర్యటన రద్దు చేశారు. తాజాగా 12వ తేదీన వస్తారని జిల్లా అధికారులకు సమాచారం అందింది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కడప-బెంగళూరు హైవే పక్కన దేవపట్ల క్రాస్ వద్ద హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు.
News November 9, 2025
HYD: చివరి రోజు.. అభ్యర్థుల్లో టెన్షన్!

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. అసలే ఆదివారం సెలవు. అభ్యర్థులు ఉదయాన్నే ఓటర్ల డోర్లు తడుతున్నారు. ఉన్నది ఒక్కటే రోజు.. ఎల్లుండే పోలింగ్.. ఎవరినైనా మిస్ అయ్యామా? అనే అంతర్మథనంలో పడుతున్నారు. తాయిళాలు మొదలుపెట్టి గెలుపు కోసం INC, BRS, BJP సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. ఎంత చేసినా సైలెంట్ ఓటింగ్ అభ్యర్థుల్లో టెన్షన్ను పెంచుతోంది.


