News January 28, 2025
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా ఉండాలి: సీపీ

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం పోలీస్ అధికారులతో సీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీలు, ఏఎస్పీ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

iBOMMA, BAPPAM సైట్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ అవ్వడం లేదు. iBOMMA సైట్లో 1XBet అనే <<18296786>>బెట్టింగ్<<>>, ఆన్లైన్ గేమింగ్ యాప్ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించడం అతడి ప్లాన్ అని, ఇందుకోసం బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2025
పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2025
త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.


