News April 7, 2025
ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: గంట రవికుమార్

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. సోమవారం శివనగర్లో ఓ రేషన్ షాపు వద్ద నరేంద్ర మోదీ ఫొటో పెట్టి మాట్లాడారు. రేషన్ బియ్యం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసలు ఇస్తుంటే.. మొత్తం తామే ఇస్తున్నట్టు కాంగ్రెస్ గప్పాలు కొడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఉన్నారు.
Similar News
News July 8, 2025
WGL: నేడు 118 విద్యాలయాల్లో ‘స్ఫూర్తి’

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
News July 8, 2025
వరంగల్ జిల్లాలో 37.6 శాతం వర్షాపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో వర్షపాతం మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 37.6 శాతం నమోదైంది. గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖిలా వరంగల్, మండలాల్లో మోస్తరు వర్షం కురవగా పర్వతగిరిలో వర్షం కురువలేదని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి, ఖానాపూర్, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది.
News July 8, 2025
రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రేషన్ డీలర్ల కష్ట సుఖాలు పాలుపంచుకుని వారి సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోస్ట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.