News April 18, 2024
ప్రజలు అసలు బయటకు రావద్దు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల వల్ల తీవ్రతరం అయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. కాగా వాతావరణశాఖ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Similar News
News April 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్లో 694 మందిపై కేసు నమోదు

ఖమ్మం: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 673 మందితో పాటు 21 మంది మైనర్ల డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలోని 20 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 22, 2025
KMM: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. సైబర్ నేరస్థుడు అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ఓ సైబర్ నేరస్థుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ DSP పనిందర్ తెలిపారు. DSP కథనం ప్రకారం.. నిందితుడు MK తమిళగన్ మరికొంతమంది నిందితులతో కలిసి ఆన్లైన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.9,25,575 నగదును తీసుకొని మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఖమ్మం కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
News April 22, 2025
ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు: అదనపు కలెక్టర్

KMM: యాసంగి పంట కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా భారత ఆహార సంస్థ నిర్దేశించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు తరుగు తీయడానికి వీలు లేదని సూచించారు.