News March 1, 2025

ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్

image

ఆత్మకూరు పురపాలక సంఘంలోని 5వ వార్డు నీలితొట్టి వీధిలో సరఫరా అయ్యే తాగు నీరు కలుషితం కాలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ల్యాబ్ టెస్టుల్లో నీరు కలుషితమైనట్లు నిరూపణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానికంగా అతిసార ప్రబలడంతో వైద్య సిబ్బంది 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్‌లను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News March 21, 2025

వరంగల్: భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

భద్రకాళి అమ్మవారికి ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం శుక్రవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు పూజలు చేసి వేదాశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు. 

News March 21, 2025

MBNR: టెన్త్ విద్యార్థులు.. ఫోన్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు ఏవైనా సూచనలు, సందేహాలు ఉంటే MBNR-98487 57542,93908 11476, NGKL-94406 48324,98850 17701 టోల్ ఫ్రీ నంబర్లు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హాల్ టికెట్‌పై బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ సూచిస్తుందని అధికారులు తెలిపారు.

News March 21, 2025

సిద్దిపేట: బాలికపై అత్యాచారం

image

సిద్దిపేట జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగింది. ఎస్సై విజయ్ వివరాలిలా.. ములుగు మండలానికి చెందిన బాలిక తల్లి చనిపోగా తండ్రితో ఉంటుంది. వరుసకు బాబాయి అయిన స్వామి(40) బాలికకు చాక్ లేట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం తెలుసున్న స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. బాలికను గజ్వేల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!