News January 1, 2025
ప్రజలు సంతోషంగా జీవించాలి: కృష్ణా ఎస్పీ
కృష్ణా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ ఆర్.గంగాధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేళ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందాన్ని పంచే కొత్త సంవత్సర ఆగమన వేళ ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు.
Similar News
News January 23, 2025
కృష్ణా: కమిషనరేట్లో నేతాజీ జయంతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మచిలీపట్నం పోలీస్ కమిషనరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు, పోలీస్ సిబ్బంది సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక ఘట్టాలను వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయి పంచిపెట్టారు.
News January 23, 2025
కృష్ణా: గమనిక..1వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ(2024-25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 18 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని ANU సూచించింది.
News January 23, 2025
జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ, ఆధ్వర్యంలో ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్. వీర రాఘవయ్య ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ను పరిశీలించారు.