News September 25, 2024
ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వండి: కృష్ణా కలెక్టర్

స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 దార్శనిక పత్రం (విజనరీ డాక్యుమెంట్) తయారీపై ప్రజలు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, MPDOలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజనరీ డాక్యుమెంట్ తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై సమీక్షించారు.
Similar News
News November 12, 2025
పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలి: కలెక్టర్

మచిలీపట్నంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. చింతగుంటపాలెంలో పీఎంఏవై 1.0 పథక గృహాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 6,708 గృహాలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త లబ్ధిదారులు నవంబర్ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News November 12, 2025
పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలి: కలెక్టర్

మచిలీపట్నంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. చింతగుంటపాలెంలో పీఎంఏవై 1.0 పథక గృహాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 6,708 గృహాలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త లబ్ధిదారులు నవంబర్ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News November 12, 2025
రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లాకు రెండో స్థానం

అనంతపురంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లా బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది కృషి, నిబద్ధత ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ వారిని అభినందించారు.


