News March 29, 2024

ప్రజల ఆస్తులు కబ్జా: చంద్రబాబు

image

వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని.. ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కావలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలపైనే కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News September 29, 2024

గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు

image

గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

News September 29, 2024

కలువాయి మండలంలో మరో సైబర్ క్రైం

image

కలువాయిలో ఆశా వర్కర్ ఖాతా నుంచి నగదు కొట్టేసిన ఘటన తెలిసిందే. అదే మండలంలోని ఉయ్యాలపల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న యస్. వెంకటరమణమ్మ ఖాతా నుంచి రూ.33,350 సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీ మొబైల్‌లో ఈ-సిమ్ యాక్టివేట్ అయ్యింది ప్రొఫైల్ ‘ON’ చేయమని మెసేజ్ వచ్చింది. దీనితో ఆమె ‘ON’ నొక్కగానే ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందని ఆమె తెలిపారు.

News September 29, 2024

నెల్లూరు జిల్లాలో ASIలుగా పోస్టింగ్ పొందింది వీరే..

image

➥భాస్కర్ రెడ్డి-ఏఎస్ పేట
➥రియాజ్ అహ్మద్-చిన్నబజార్
➥వరప్రసాద్, ఉమామహేశ్వరరావు-సౌత్ ట్రాఫిక్
➥శ్రీహరిబాబు, శ్రీధర్రావు, లక్ష్మీ నరసయ్య-నవాబుపేట
➥షేక్.జిలాని-మనుబోలు
➥మాల్యాద్రి-కావలి2
➥మునిరావు-వేదాయపాలెం
➥రాజగోపాల్-గుడ్లూరు
➥ వెంకటేశ్వర్లు-ఇందుకూరుపేట
➥మాధవరావు-వేదయపాలెం
➥కరీముల్లా-విడవలూరు
➥సురేంద్రబాబు-Nరూరల్
➥మునికృష్ణ-వెంకటాచలం
➥V.శ్రీనివాసులు-కోవూరు