News March 29, 2024
ప్రజల ఆస్తులు కబ్జా: చంద్రబాబు

వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని.. ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కావలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలపైనే కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News December 9, 2025
నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.
News December 9, 2025
నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.
News December 9, 2025
గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

నగరంలో నిన్న సాయంత్రం బోసు బొమ్మ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ను తీయమన్నందుకు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. నిందితులకు నేర చరిత్ర లేదని, క్షణికావేశంలో ఈ ఘటన జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపట్ల నగరవాసులు అభినందనలు తెలిపారు.


