News November 13, 2024
ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన మంత్రి పొంగులేటి

HYDలోని రాజ్ భవన్లో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి మంత్రి సమస్యలతో కూడిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Similar News
News December 5, 2025
స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలెక్కడ?: ఎంపీ

స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు ఎలాంటి కార్యాచరణను ఆచరిస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశీయ తయారీదారులకు సబ్సిడీ, ప్రోత్సాహకాల గురించి, రక్షణ సముపార్జన ప్రక్రియకు కేంద్రం ఏమైనా సవరణలు చేసిందా? అడిగారు. దీనిపై కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ స్పందిస్తూ.. స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు.
News December 5, 2025
ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి: ఎంపీ

వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ఎంపీ రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు. ఇరుముడి ధరించి, అయ్యప్ప సన్నిధానం శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్కు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. BNSS 163 యాక్ట్ అమలు: సీపీ

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలలో సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు.


