News April 10, 2025
ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ నారాయణరెడ్డి

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల ద్వారా నేరాలను అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఉండేందుకు తనిఖీలు చేశామని చెప్పారు.
Similar News
News February 23, 2026
HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
News February 23, 2026
ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News February 23, 2026
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశం

జిల్లా యువ ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్(TGIC) ముందుకొచ్చింది. ఫిబ్రవరి 28 ఉదయం 10 గంటలకు నిజామాబాద్ నాయుడు టవర్లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’ నిర్వహిస్తోంది. ఇక్కడ స్టార్టప్స్, వ్యాపార విస్తరణ, నూతన ఆవిష్కరణలపై నిపుణులు సలహాలు ఇస్తారు. ప్రభుత్వ సాయంపై దిశానిర్దేశం చేస్తారు. యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు.


