News April 10, 2025
ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ నారాయణరెడ్డి

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల ద్వారా నేరాలను అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఉండేందుకు తనిఖీలు చేశామని చెప్పారు.
Similar News
News April 21, 2025
ప.గో: పోలీస్ శాఖ పీజీ ఆర్ఎస్కు 23 అర్జీలు

ప.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్కు 23 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
News April 21, 2025
నాటి కడలూరు నేడు రైల్వేకోడూరు

కడలూరు అనే పేరుతో పూర్వం ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం నేడు రైల్వే కోడూరుగా కొనసాగుతోంది. బ్రిటిష్ వారి పాలనలో రైల్వే వ్యవస్థ విస్తరించిన కాలంలో, ఈ ప్రాంతం చివరి రైల్వే స్టేషన్గా ఉండేది. కాలక్రమేణా కడలూరు అనే పేరు కనుమరుగై, రైల్వే కోడూరు అనే పేరు స్థిరపడిపోయింది. ఈ చివరి స్టేషన్ వ్యాపారస్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ముఖ్యంగా బొంబాయి వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసేవారు.
News April 21, 2025
గుంటూరు: పరీక్షల షెడ్యూల్ విడుదల

అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి పేపరు 70 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టులుగా టీచర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటాయి. విద్యార్థులు పరీక్ష తేదీలను గమనించాలని సూచించారు.