News March 11, 2025

ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యత: SP

image

కామారెడ్డి జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణంపై ఫోకస్ పెడతామన్నారు. పారదర్శక సేవల కోసం పోలీస్ శాఖలో ఆన్‌లైన్ విధానానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌ సందర్శించారు. నేరాలు జరుగుతున్న తీరు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే విధానాన్ని పరిశీలించారు.

Similar News

News October 15, 2025

కామారెడ్డి: 2 రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేయండి!

image

కామారెడ్డి జిల్లాలోని 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరైన, ఇంతవరకు సీటు పొందని విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4.30 వరకు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.

News October 15, 2025

PCC చీఫ్ సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి: MP

image

రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ROB నిధులపై సరైన అవగాహన లేదని, ముందుగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి సూచించారు. బుధవారం MP మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం BJPపై బురద జల్లి BRSను కాపాడే ప్రయత్నం చేస్తుందని, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలు ఉన్నాయని తేలినా ఏమి చేయలేదన్నారు.

News October 15, 2025

నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: MP

image

NZB జిల్లాలోని ROBలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని MP ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. BJP జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేయగా గత ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయన్నారు.