News January 26, 2025

ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి: రంగనాథ్

image

హైడ్రాలోని ప్రతీ అధికారి ప్రజ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్ చెప్పారు. గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆదివారం హైడ్రా కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ జాతీయ జెండాను ఎగుర‌వేశారు. 2025 సంవ‌త్సరం హైడ్రాకు ఎంతో కీల‌క‌మైందన్నారు. చెరువుల ప‌రిర‌క్షణ‌, ప్రభుత్వ భూముల‌తో పాటు ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూముల‌ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కంక‌ణ‌బ‌ద్ధులు కావాల‌న్నారు.

Similar News

News February 15, 2025

HYDలో పెరిగిన 100 వాటర్ ట్యాంకర్లు

image

గ్రేటర్ HYD మహానగర వ్యాప్తంగా వాటర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా 100 ట్యాంకర్లను కొత్తగా జలమండలి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీంతో ట్యాంకర్ల సంఖ్య 949కి చేరింది. ప్రస్తుతం 78 ఫీలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరో 126 ఫీలింగ్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరిగినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

News February 14, 2025

HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

image

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.

News February 14, 2025

గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ

image

గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ కుమార్ పట్టుబడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75వేలు డిమాండ్ చేశారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు. కాగా, ఈరోజు మరో రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ACB అధికారులు పట్టుకున్నారు.

error: Content is protected !!