News March 18, 2025

ప్రజల సమస్యలను పరిష్కరించాలి: అన్నమయ్య కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను శ్రద్ధతో బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మొత్తంగా 300 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు.

Similar News

News November 24, 2025

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో భక్తుల ఆగ్రహం!

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో కొలువై ఉన్న వల్లభ గణేశుడి ఆలయాన్ని సమయానికి తెరవకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలు దాటినా ఆలయం తలుపులు తెరుచుకోకపోవడంతో, గణేశుడిని దర్శించుకోవడానికి చేరుకున్న భక్తులు అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రతి రోజూ నిర్దిష్ట సమయానికి పూజలు ప్రారంభమవుతుండగా, ఈరోజు ఆలస్యానికి స్పష్టమైన కారణం తెలియకపోవడంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది.

News November 24, 2025

సీ క్లే గురించి తెలుసా?

image

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు క్లే మాస్కులు వాడటానికే మొగ్గు చూపుతున్నారు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. వాటిల్లో ఒకటి సీ క్లే. దీన్నే ఫ్రెంచ్ గ్రీన్ క్లే అని పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే దీంట్లో ఐరన్ ఆక్సైడ్స్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ కూడా అందుతాయి. మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఆయిల్, సెన్సిటివ్ స్కిన్ వారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.

News November 24, 2025

బుచ్చిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసింది రౌడీషీటర్లు..?

image

బుచ్చిలో గత శనివారం ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారు నెల్లూరుకు చెందిన రౌడీషీటర్లుగా నిర్ధారించి ఎస్పీ ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హైవేపై కారు డోరు తెరిచి ఉంచడంతో నెల్లూరు నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టారు. వెంటనే కారులో ఉన్న వారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. కారులో బీరు బాటిల్ కూడా దర్శనమిచ్చాయి.