News March 18, 2025

ప్రజల సమస్యలను పరిష్కరించాలి: అన్నమయ్య కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను శ్రద్ధతో బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మొత్తంగా 300 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు.

Similar News

News December 5, 2025

అనకాపల్లి: పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి

image

పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించి ఇన్సూరెన్స్ బాండ్లను పోలీస్ సిబ్బందికి అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే పోలీసులకు ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు శ్రమించే పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.

News December 5, 2025

MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

image

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.

News December 5, 2025

KNR: ‘నజరానా’లంటారు.. ‘నారాజ్’ చేస్తారు..!

image

స్థానిక ఎన్నికల వేళ ప్రకటిస్తున్న నజరానాలు నీటి మూటలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ఉమ్మడి KNRలో 106 GPలు ఏకగ్రీవమవ్వగా తాజాగా 20 GP(1ST ఫేజ్)లు ఏకగ్రీవమయ్యాయి. అప్పటి BRS ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామాలకు రూ.5 లక్షలిస్తానని రూపాయీ ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10లక్షల నజరానా ప్రకటించగా కేంద్రమంత్రి బండి సంజయ్ BJP మద్దతున్న అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.