News October 30, 2024
ప్రజాభవన్లో ప్రజావాణికి 588 దరఖాస్తులు

ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 588 దరఖాస్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 221, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 98, విద్యుత్ శాఖకు 84, రెవెన్యూ పరమైన సమస్యలపై 55, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు 126 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకఅధికారి దివ్య పాల్గొన్నారు.
Similar News
News January 11, 2026
HYD: కార్పొరేషన్ కోసం లష్కర్లో లడాయి

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.
News January 11, 2026
HYD: ఆ నలుగురు లేకపోయినా!

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.
News January 11, 2026
HYD: GHMCలో విలీనం.. ఇక కుదరదు

GHMCలో మున్సిపాలిటీల విలీనం తర్వాత అనధికారిక హోర్డింగులు, బ్యానర్లు, ప్రకటనా నిర్మాణాలపై అధికారులు నగరవ్యాప్త స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. ప్రజా, రోడ్డు భద్రత, నగర సౌందర్యం కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అన్నీ జోన్లలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన GHMC దశలవారీగా నిరంతరం ఈ డ్రైవ్ను చేపడుతుంది. అనధికారిక ప్రకటనలను ఏర్పాటు చేస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించింది.


