News December 6, 2024
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తాం:చైర్మన్

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ డేడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఎక్కువ మంది వారి విజ్ఞాపనలు అందించారని తెలిపారు.
Similar News
News January 23, 2026
NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు

మేయర్ పదవీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BJP తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తిస్థాయిలో BJP, కాంగ్రెస్ హడావుడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు.
News January 23, 2026
NZB: టీచర్గా మారిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ గంగస్థాన్లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు విద్యార్థులకు ఉపాధ్యాయురాలిగా మారి ఆకట్టుకున్నారు. తరగతి గదిలో స్వయంగా బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను రాసి బాలికలకు బోధించారు. విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి వారిని ఉత్సాహపరిచారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ పాఠాలు చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు.
News January 23, 2026
NZB: టీచర్గా మారిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ గంగస్థాన్లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు విద్యార్థులకు ఉపాధ్యాయురాలిగా మారి ఆకట్టుకున్నారు. తరగతి గదిలో స్వయంగా బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను రాసి బాలికలకు బోధించారు. విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి వారిని ఉత్సాహపరిచారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ పాఠాలు చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు.


