News August 27, 2024
ప్రజారోగ్యానికి టీడీపీ ప్రభుత్వం ఉరితాడు వేస్తోంది: జగన్

కృష్ణా: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి టీడీపీ ప్రభుత్వం ఉరితాడు వేస్తోందని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందడంలేదని, రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పురోగతి సైతం కుంటుపడిందని జగన్ వ్యాఖ్యానించారు. వైద్య సిబ్బంది నియామకం, ఆరోగ్యశ్రీ అమలులో వైఫల్యం టీడీపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని జగన్ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
Similar News
News February 27, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు: కృష్ణా SP
* ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ను పరామర్శించిన లక్ష్మీపార్వతి
* ఆయేషా మీరా కేసులో న్యాయం జరగలేదని పేరెంట్స్ ఆవేదన
* మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు నుంచి కాపాడిన పోలీసులు
* CRDA కార్యాలయంలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
* బాపులపాడు డిప్యూటీ MPDOపై సస్పెన్షన్ వేటు
* గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
News February 27, 2026
డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదు: కృష్ణా ఎస్పీ

న్యాయవ్యవస్థలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం
ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన.. ఇటీవల సైబర్ నేరగాళ్ల చెర నుంచి పోలీసుల సాయంతో బయటపడ్డ వృద్ధ దంపతులను అభినందించారు. జిల్లావ్యాప్తంగా దీనిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
News February 27, 2026
ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు పాల్గొనవచ్చన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న యువత విద్యార్హత ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.


