News April 12, 2025
ప్రజారోగ్యానికి ప్రభుత్వం భరోసా.. రూ.85 కోట్లు మంజూరు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. TG సెక్రటేరియట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 21, 2025
MNCL:ఈనెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల23న ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆదిలాబాద్లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈపోటీల్లో ఎంపికైనవారు సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News November 21, 2025
దేవరకొండ ASP మౌనిక ఆదిలాబాద్కు బదిలీ

దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. ఏఎస్పీగా ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.
News November 21, 2025
బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలి: దేవినేని ఉమా

ప్రజాస్వామ్యంలో పేదవాడైనా, సంపన్నుడైనా చట్టం ముందు అందరం సమానమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరవు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వస్తున్నావని అభిమానం ఉప్పొంగిందా అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఏపీపై విషం చిమ్ముతున్న బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలని దుయ్యబట్టారు.


