News April 12, 2025

ప్రజారోగ్యానికి ప్రభుత్వం భరోసా.. రూ.85 కోట్లు మంజూరు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. TG సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు.

Similar News

News February 24, 2026

CM చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ: మంత్రి ఉత్తమ్

image

హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా తొలి విడతగా 1,000 మంది పేదలకు ఈ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన లబ్ధిదారులకు వీటిని కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.

News February 24, 2026

మాలలో పార్టీకి వెళ్లిన చరణ్‌పై విమర్శలు.. శిరీష్ క్లారిటీ!

image

హీరో అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి అయ్యప్ప మాలలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శిరీష్ స్పందించారు. ‘చరణ్ ఆ పార్టీకి చాలా తొందరగా వచ్చారు. అప్పటికి అక్కడ ఎవరూ లేరు. పార్టీ కూడా మొదలుకాలేదు. ఎవరూ ఆల్కహాల్ కూడా ముట్టుకోలేదు. ఆయన మమ్మల్ని విష్ చేసి ఫొటో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు’ అని తెలిపారు. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది.

News February 24, 2026

చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.