News April 12, 2025
ప్రజారోగ్యానికి ప్రభుత్వం భరోసా.. రూ.85 కోట్లు మంజూరు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. TG సెక్రటేరియట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు.
Similar News
News October 16, 2025
పెళ్లి కాకుండా దత్తత తీసుకోవచ్చా?

హిందూ దత్తత, భరణం చట్టం 1956 ప్రకారం అవివాహిత స్త్రీలు, మానసికస్థితి బావున్నవారు, మేజర్లు, పెళ్లయినా భర్త వదిలేసినవాళ్లు లేదా భర్త చనిపోయినవాళ్లు, భర్త ఏడేళ్లకు పైగా కనిపించకుండా పోయినవాళ్లు, భర్తకు మతిస్థిమితం లేదని కోర్టు ద్వారా నిరూపితమైన సందర్భాల్లో స్త్రీలు దత్తత తీసుకోవడానికి అర్హులు. సెక్షన్-11 ప్రకారం అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీకు పిల్లాడికి మధ్య 21 ఏళ్లు తేడా ఉండాలి.
News October 16, 2025
కొయ్యలగూడెం: ఆవుకి కవల దూడలు జననం

కొయ్యలగూడెంలోని పరింపూడి పశువైద్యశాల వద్ద ఆవు అరుదైన కవలలకు (ఒక పెయ్య, ఒక గిత్త దూడ) జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆవు ఇబ్బంది పడగా, వైద్యాధికారి బి.ఆర్. శ్రీనివాస్ ట్రాక్టర్ హైడ్రాలిక్ సహాయంతో ఆవును పైకి ఎత్తి ప్రసవం అయ్యేలా కృషి చేశారు. ఈ ప్రత్యేక ప్రయత్నానికి రైతులు వైద్యాధికారి, సిబ్బందిని అభినందించారు.
News October 16, 2025
ఫెడరల్ బ్యాంక్లో ఉద్యోగాలు

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్సైట్:https://www.federalbank.co.in/