News March 6, 2025
ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక చర్యలు: MNCL కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంచిర్యాల కలెక్టరేట్లో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను కనీసం 15 రోజులు, గరిష్ఠంగా 21 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News December 4, 2025
తిరుపతి: 11 ఏళ్ల అంధ మారథాన్ అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగులు

ప్రపంచ రికార్డు సాధన దిశగా 11 ఏళ్ల అంధ బాలుడు మురారి హర్షవర్ధన్ ముందడుగు వేశాడు. హర్షవర్ధన్ నాన్-స్టాప్ 200 km బ్లైండ్ మల్టీ-టాస్క్ రోడ్డు స్కేటింగ్ మారథాన్ను ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి చేయనున్నారు. ఈ అరుదైన సాహసానికి AP శాప్ ఛైర్మన్ రవినాయుడు అండగా నిలిచారు. మారథాన్కు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయంతో పాటు, అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలని చిత్తూరు, తిరుపతి క్రీడా అధికారులను ఆదేశించారు.
News December 4, 2025
బాలాజీ రైల్వే డివిజన్ కోసం వినతి

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని సాధన సమితి నాయకులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను న్యూఢిల్లీలో కలిశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, ఎంపీ దుర్గాప్రసాద్తో కలిసి సమితి వినతిపత్రం సమర్పించారు. రాయలసీమ అభివృద్ధికి డివిజన్ అవసరమని తెలిపారు. రేణిగుంట, తిరుచానూరు స్టేషన్ల అభివృద్ధితో పాటు సింహపురి ఎక్స్ప్రెస్ను రేణిగుంట వరకు పొడిగించాలని కోరారు.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.


