News March 18, 2025

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి: అడిషనల్ కలెక్టర్లు

image

మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకాలలోనైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 21, 2025

దుబాయ్‌లో పెట్టుబడిదారులతో పెద్దపల్లి MP భేటీ

image

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావాలనే లక్ష్యంతో పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ దుబాయ్‌లో ప్రముఖ పెట్టుబడిదారులతో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పారిశ్రామిక పెట్టుబడుల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలని MP వివరించారు. బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్లు వంటి మౌలిక వసతులు ఉన్న ఈ ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

News October 21, 2025

యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు(బుధవారం) గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రవి నాయక్ తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

News October 21, 2025

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: అనకాపల్లి కలెక్టర్

image

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. మంగళవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిస్వార్ధంగా పనిచేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం, నిబద్ధత కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు.