News March 18, 2025

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి: అడిషనల్ కలెక్టర్లు

image

మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకాలలోనైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 10, 2025

1,284 మంది బైండోవర్: ఎస్పీ నరసింహ

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని ఎస్పీ నరసింహ చెప్పారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, పాత నేరస్థులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారు 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. 136 కేసుల్లో రూ.9,50,000 విలువైన 1,425 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపాపారు. లైసెన్స్ కలగిన 53 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు.

News December 10, 2025

NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.

News December 10, 2025

MBNRలో హై ఓల్టేజ్ ఫైట్.. తండ్రి, కూతురు ఢీ

image

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్సీ జనరల్ స్థానం కోసం తండ్రి ముద్ధం రాములు, కూతురు ముద్ధం నవ్య శ్రీలు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వీరిద్దరే బరిలో నిలవడం విశేషం. అంతేకాక, వీరిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ఈనెల 17న కొల్పూర్ ఎన్నికల ఫలితం వెల్లడికానుంది.