News October 29, 2024
ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచవద్దు: కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని.. పెండింగ్లో ఉంచవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 53 ఫిర్యాదులు రాగా, అందులో రెవిన్యూకు సంబంధించి (26),ఇతర శాఖలకు సంబంధించి ( 27) దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 23, 2025
నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
News November 22, 2025
BREAKING: నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్

డీసీసీ అధ్యక్షులను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం ప్రకటించింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేతను నియమించింది. నల్గొండ డీసీసీకి పలువురు పోటీ పడినప్పటికీ మునుగోడుకు చెందిన పున్న కైలాష్ నేతనే డీసీసీ పదవి వరించింది.
News November 22, 2025
NLG: వాట్సప్తో ఇక మీ సేవలు..!

నల్గొండ జిల్లా ప్రజలకు అతి ముఖ్యమైన మీ-సేవ సేవలు మరింత సులభతరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్స్ పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మీ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించారు.


