News January 25, 2025
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం: ఎస్పీ

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని జిల్లా ఎస్పీ దామోదర్ సూచించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీసు గ్రౌండ్లో ఎస్పీ “ఓటర్స్ డే” ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశంలో 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నమన్నారు.
Similar News
News October 18, 2025
బాణసంచా విక్రయదారులకు SP సూచన.!

అనుమతి లేకుండా బాణసంచాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేశారు. ఈ సందర్భంగా బాణసంచా విక్రయ కేంద్రాల్లో 18ఏళ్లలోపు పిల్లలను పనిలో ఉంచరాదన్నారు.
News October 18, 2025
పెద్దారవీడు: పేకాట ఆడివారికి 2 రోజులు శిక్ష

మండలంంలోని రేగుమానుపల్లి గ్రామ పొలాల్లో పేకాట శిబిరంపై సెప్టెంబర్ ఆరవ తేదీ పోలీసులు దాడి చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న రూ.1,09,910లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం 14 మంది ముద్దాయిలకు మార్కాపురం జడ్జి బాలాజీ విచారించి ఒక్కొక్కరికి రూ.300 జరిమానా 2 రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు.
News October 18, 2025
ప్రకాశం: ‘15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం’

ప్రకాశం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కు గాను రూ.15వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో జేసీ సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే అవసరమగు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.