News January 31, 2025
ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది: డి.రాజా

కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మతం పేరుతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని దీనికోసం వామపక్ష, లౌకిక పార్టీలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచార ఉద్యమం చేపడతామన్నారు.
Similar News
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.
News November 18, 2025
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్ను విడుదల చేయనున్నారు.


