News December 3, 2024
ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత: ప్రకాశం SP
సమాజంలోని సామాన్య ప్రజలు, వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను పోలీసు ఉన్నదాధికారులు స్వయంగా స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
Similar News
News January 14, 2025
పొదిలి: బలవర్మరణం కేసులో ట్విస్ట్
పొదిలి పట్టణంలో గత ఏడాది రవి అనే వక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈకేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దళితనేత నీలం నాగేంద్రం జిల్లా ఎస్పీ దామోదర్ను మృతుడి భార్య సలొమితో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కేసును సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చారు.
News January 13, 2025
పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. మరొకరు మృతి
ఇటీవల పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి సజీవ దహనమైన అక్కాచెల్లెళ్ల గురించి మరువక ముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతుళ్లను కాపాడుకునే ప్రయత్నంలో కాలిపోయి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తల్లి దాసరి లక్ష్మీరాజ్యం కూడా తనువు చాలించింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పర్చూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 13, 2025
గుడ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్ను ఢీకొంది. బైక్పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కావలి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.