News January 28, 2025
ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించండి: కలెక్టర్

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇంకా 1,514 దరఖాస్తులను వ్యూ చేయలేదని, 40 రీఓపెన్ అయ్యాయని, 27 సీఎంవో దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, తక్షణమే పరిష్కరించాలని అన్నారు.
Similar News
News November 22, 2025
ఖమ్మం: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటీజీ/బీఎల్వీ సెట్ రాసిన వారికి ప్రాధాన్యత, ఇతరులకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.
News November 22, 2025
లేబర్ కోడ్స్పై మండిపడ్డ కార్మిక సంఘాలు

కేంద్రం అమల్లోకి తెచ్చిన 4 <<18350734>>లేబర్ కోడ్స్<<>>ను కార్మిక సంఘాలు ఖండించాయి. కార్మికులకు నష్టం కలిగించేలా, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని 10 లేబర్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. శ్రామికులపై యుద్ధం ప్రకటించడం తప్ప మరేమీ కాదు. పెట్టుబడిదారులతో ప్రభుత్వం కుమ్మక్కైంది’ అని మండిపడ్డాయి. లేబర్ కోడ్స్ను విత్ డ్రా చేసుకునే దాకా తాము పోరాటం చేస్తామని ప్రకటించాయి.
News November 22, 2025
20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నితీశ్

కొత్తగా కొలువుదీరిన బిహార్ క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపులు పూర్తయ్యాయి. 20 ఏళ్లుగా తన వద్దే ఉంచుకున్న కీలకమైన హోం శాఖను సీఎం నితీశ్ కుమార్ వదులుకున్నారు. డిప్యూటీ సీఎం చౌధరి(BJP)కి ఇచ్చారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా(BJP)కు రెవెన్యూ, గనుల శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, విజిలెన్స్ వంటి శాఖలు మాత్రమే నితీశ్ తన వద్ద ఉంచుకున్నారు.


