News January 27, 2025
ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో జరిగిన పీజీఆర్ఎస్ మినిట్స్ సీఎంవో పీజీఆర్ఎస్ గ్రూపులో నోడల్ అధికారికి పోస్ట్ చేయాలన్నారు. రీ సర్వే గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసి, నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడంతో పాటు ఆడిట్ చేయాలన్నారు.
Similar News
News October 19, 2025
మట్టి ప్రమిదలతోనే ఐశ్వర్యం, ఆరోగ్యం!

దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి మట్టి ప్రమిదలను వాడాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ‘మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. దీన్ని వాడటం ద్వారా దైవశక్తులను ఆకర్షిస్తాం. ఇవి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఆవు పేడతో చేసిన ప్రమిదలను వాడటం కూడా చాలా శుభప్రదం. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. ఐశ్వర్య లక్ష్మిని ఆకర్షిస్తాయి. కరెంటు దివ్వెలు కాకుండా సహజ ప్రమిదలు వాడాలి’ అని చెబుతున్నారు.
News October 19, 2025
ఈ నెల 24వరకు ఆస్ట్రేలియాలో లోకేశ్ పర్యటన

AP: మంత్రి నారా లోకేశ్ నేటి నుంచి ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశ హైకమిషనర్ ఆహ్వానం మేరకు ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం’లో పాల్గొనేందుకు ఆయన బయల్దేరారు. వచ్చే నెల 14, 15న జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేసేందుకు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. ఇవాళ స్థానిక కాలమానం ప్రకారం 11.30amకు చేరుకొని, సాయంత్రం సిడ్నీలో తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు.
News October 19, 2025
దీపావళి ‘విజేత’ ఎవరు?

ఈ సారి పండక్కి మీడియం, చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ నెల 16న ప్రియదర్శి, నిహారిక నటించిన ‘మిత్ర మండలి’, 17న ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ‘డ్యూడ్’, సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ‘తెలుసు కదా’, 18న కిరణ్ అబ్బవరం, యుక్తి ‘K RAMP’ రిలీజయ్యాయి. ఎంటర్టైన్మెంట్, లవ్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాలు తెరకెక్కాయి. మీరు ఏ సినిమాకు వెళ్లారు? ఈ దీపావళి విజేత ఎవరు? కామెంట్.