News August 19, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

నెల్లూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజాసమస్యల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశార., సోమవారం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నందున రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు.

Similar News

News November 19, 2025

నెల్లూరులో చిక్కనంటున్న.. ఆకుకూరలు

image

మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశానంటుతున్నాయి. రూ. 20కి తోటకూర 3, చిర్రాకు 3, గోంగూర 3 కట్టలు ఇస్తున్నారు. గతంలో ఈ ధరకు రెట్టింపు ఇచ్చేవారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకువడంతో ధరలు అమాంతం పెరిగాయి. వీటితోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. దీంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది.

News November 19, 2025

ఉదయగిరి: బాలికపై యువకుడు లైంగిక దాడి

image

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం దుత్తలూరు మండలంలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికకు కొద్ది నెలల క్రితం వింజమూరుకు చెందిన సాథిక్ అనే యువకుడికి పరిచయమయ్యాడు. ఈక్రమంలో బాలికను ఉదయగిరి దుర్గంపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అత్యాచారానికి గురైందని డాక్టర్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కేసు నమోదు చేశారు.

News November 19, 2025

కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

image

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.