News December 4, 2024
ప్రజా సమస్యలు పారదర్శకంగా పరిష్కరించాలి: కలెక్టర్

పిజిఆర్ఎస్లో వచ్చిన ప్రతి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని మంగళవారం అధికారులను కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. అమరావతి నుంచి సి.సి.ఎల్.ఏ.జి జయలక్ష్మి పి.జి.ఆర్.ఎస్ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 17, 2025
ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
News November 17, 2025
19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు..?

సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది.
News November 17, 2025
కడప: ‘మహిళలు ఉపాధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

కడపలోని కెనరా బ్యాంక్ శిక్షణ శిబిరం నందు నిర్వహించే శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ పేర్కొన్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 45 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ విభాగాలలో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.


