News November 18, 2024

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం వికేంద్రీకరణ: కలెక్టర్ ఆనంద్

image

ప్రజల వద్దకు పరిపాలనను మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వికేంద్రీకరణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రేపటి నుంచి మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్ర కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయా కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చునని ఆయన వివరించారు.

Similar News

News January 4, 2026

ఒక్కొక్కడికి దూల తీరుస్తా: ఉదయగిరి ఎమ్మెల్యే

image

ఉదయగిరిలో ఓ పెద్ద మనిషి <<18759752>>నీచంగా<<>> ఆలోచించి మహిళతో ఆరోపణలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అన్నారు. ‘నేను విజయవాడలోని ఓ హోటల్లో ఉన్నప్పుడు వెంగమాంబను అక్కడికి రప్పించి తప్పుడుగా వీడియోలు చిత్రీకరించాలని చూశారు. అప్పటి నుంచి నాతో సహా మా టీం అంతా ఆమెను దూరం పెట్టింది. నన్ను ఏదో చేస్తే వెళ్తాననుకుంటున్నారు. 25ఏళ్లు ఉదయగిరిలోనే ఉంటా. ఒక్కొక్కడికి దూల తీరుస్తా’ అని కాకర్ల హెచ్చరించారు.

News January 4, 2026

వెంగమాంబ ఆరోపణలు అవాస్తవం: కాకర్ల

image

ఉదయగిరి MLA కాకర్లపై వెంగమాంబ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. ‘ఆమెను రెండుమూడు సార్లు కారులో ఎక్కుంచుకున్న విషయం నిజమే. అప్పుడు నా భార్య కూడా ఉంది. కానీ ఆమె ఆరోపణల్లో నిజం లేదు. ఆమె మూడు నెలలు మాత్రమే మా నియోజకవర్గంలో పని చేశారు. MLA టికెట్ TDP తరఫున చంద్రబాబు ఇస్తారు. నేను ఎలా ఇస్తాను. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసు. వారిపై లీగల్ గా వెళుతున్నాం’ అని కాకర్ల స్పష్టం చేశారు.

News January 4, 2026

నెల్లూరు: కారులో తనిఖీలు.. భారీగా బంగారం సీజ్

image

కారులో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను GST, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా కారులో ఉన్న రూ.3.7 కోట్ల విలువజేసే 3.1 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ట్రెజరీలో భద్రపర్చారు. సదరు వ్యక్తి వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.