News November 18, 2024
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం వికేంద్రీకరణ: కలెక్టర్ ఆనంద్

ప్రజల వద్దకు పరిపాలనను మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వికేంద్రీకరణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రేపటి నుంచి మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్ర కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయా కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చునని ఆయన వివరించారు.
Similar News
News September 19, 2025
నెల్లూరు: రూ.15వేల సాయం.. నేడే లాస్ట్ ఛాన్స్

నెల్లూరు జిల్లాలోని ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర కింద రూ.15వేలు సాయం చేయనుంది. ఈనెల 17వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2023 వరకు ఈ పథకం కింద సాయం పొందిన వాళ్లు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్లు ఎవరైనా ఉంటే ఇవాళ సాయంత్రంలోపే దరఖాస్తు చేసుకోవాలి. 2023 వరకు సాయం పొందిన వాళ్లు సైతం సచివాలయంలో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిది.
News September 18, 2025
వేగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కోవూరు మండలం వేగూరు పంచాయతీలో పిడుగుపాటుకు గోళ్ల వెంకయ్య మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించారు.
News September 18, 2025
వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఆటో, మాక్సీ క్యాబ్ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.