News March 10, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయన వెంట జాయింట్ కలెక్టర్ కార్తీక్, తదితరులు ఉన్నారు.
Similar News
News February 26, 2026
నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్తో ఒకరి మృతి?

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 26, 2026
నెల్లూరు: మీ ఏరియాలో పాలు బాగుంటాయా?

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తిస్తున్నారు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉండగా.. వీటిల్లో తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు. మీ దగ్గర పాలు బాగుంటాయా? లేదా?
News February 26, 2026
నెల్లూరు: కౌలు రైతులకు రిక్త హస్తం..!

2025-26 ఏడాదికి 38 వేల మందికి CCRC(పంట సాగుదారు హక్కు పత్రాలు) ఇవ్వాల్సి ఉండగా 22,600 మందికి మాత్రమే ఇచ్చారు. వీరికి ఇచ్చిన రుణాలపై లీడ్ బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు వద్ద లెక్కలు లేవట. యజమానులు తమ భూములుపై ఇప్పటికే రుణాలు తీసుకోగా కౌలు కార్డుదారులకు రుణాలు అందడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు అందక.. బయట అధిక వడ్డీల భారం మోయలేక కౌలు రైతులు డీలా పడుతున్నారు. రబీ స్టార్ట్ అయి 2 నెలలు అవుతోంది.


