News March 23, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు 

image

తిరుపతి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగే సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం 24వ తేది నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ మార్పును జిల్లా వాసులు గమనించాలని ఆయన కోరారు. 

Similar News

News November 6, 2025

ADB: తండ్రీ, కొడుకుకు 20 ఏళ్ల జైలు

image

మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో తండ్రీ, కొడుకులకు ADB పోక్సో కోర్టు న్యాయమూర్తి శివరాంప్రసాద్ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఘాతుకానికి సహకరించిన మహిళకు 3 నెలల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది FEB 14న సుష్మా అనే మహిళ బాధిత బాలికను ఇంటికి పిలిచి బయట నుంచి తలుపులు వేసింది. ఆ మహిళ భర్త అనిల్, తండ్రి గంగాధర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

News November 6, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో ధరలు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,051, కనిష్ఠ ధర రూ.1,700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.1,901, కనిష్ఠ ధర రూ.1,775, వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2,061, కనిష్ఠ ధర రూ.1,910, వరి ధాన్యం (HMT) ధర రూ.1,850, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2,480, కనిష్ఠ ధర రూ.1,850గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

News November 6, 2025

మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

image

బోరాన్‌ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్‌ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.