News March 23, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేళలు ఇవే: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి వచ్చే ప్రజలెవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం 9.30 గంటలకే అర్జీల స్వీకరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.

Similar News

News November 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 06, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 6, 2025

జగిత్యాల: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం..!

image

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు మగబాబు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News November 6, 2025

KNR: స్థానిక సమరం ఎప్పుడు..? బైపోల్ ప్రచారంలో బిజీగా పెద్దలు

image

BCరిజర్వేషన్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, ఎన్నికలను ఎప్పుడనే విషయాన్ని ఈనెల 24లోపు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. CM, మంత్రులు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బిజీగా ఉండటంతో ప్రకటన మరింత ఆలస్యం కానుంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,216 GPలు, 60 ZPTCలు, 646 MPTC స్థానాలున్నాయి.