News April 13, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

తిరుపతి కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆ రోజున బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినాన్ని ప్రకటించిందన్నారు. దీంతో కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. 

Similar News

News November 18, 2025

NRPT: పొగమంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ

image

చలికాలం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఉంటుందని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని, వాహనాలు నెమ్మదిగా నడపాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం చేసిన, అజాగ్రత్తగా ఉన్న పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు చెప్పారు. హెడ్ లైట్లను బీమ్‌లో ఉంచి ఫాగ్ లైట్లు వాడాలని సూచించారు. ఏకాగ్రతతో వాహనాలు నడిపించాలని చెప్పారు.

News November 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 70 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. ఆ వాయు దేవుడి పుత్రుడు కాబట్టే ఆంజనేయ స్వామిని మారుతి అని అంటారు. హనుమంతుడు వాయు శక్తి, వేగాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆకాశంలో పయనించేటప్పుడు, ఆయన వేగం, శక్తి వాయువుతో సమానం. అలా వాయు శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపుడిగా ఆయన్ను మారుతిగా కీర్తిస్తారు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 18, 2025

ములుగు: మావోయిస్టులకు సేఫ్ జోన్‌గా తెలంగాణ?

image

మోస్ట్ వాంటెడ్, సీసీ కమిటీ మెంబర్ మడవి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో వేల సంఖ్యలో జవాన్లు అడవుల్లో జల్లడ పడుతుండడం, వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు దళాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం కాల్పుల విరమన ఉండటంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ కానుందని తెలుస్తోంది. కాగా మావోయిస్టులు సైతం తెలంగాణలో మరో 6 నెలల పాటు సీజ్ ఫైర్ ప్రకటించిన విషయం తెలిసిందే.