News April 13, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

తిరుపతి కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆ రోజున బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినాన్ని ప్రకటించిందన్నారు. దీంతో కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
Similar News
News September 16, 2025
TODAY HEADLINES

* యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ.800 ఇస్తాం: చంద్రబాబు
* కాలేజీల యాజమాన్యాలతో TG ప్రభుత్వం చర్చలు సఫలం
* చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం: PM మోదీ
* మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్
* బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా
* వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
* ఆసియా కప్లో సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా
News September 16, 2025
వక్ఫ్ చట్టంపై SC ఉత్తర్వులను స్వాగతించిన KTR

TG: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర <<17717100>>ఉత్తర్వులను<<>> మాజీ మంత్రి KTR స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలను BRS మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ‘చట్టంలోని సమస్యలపై మేం పోరాడాం. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి. ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు’ అని ఆయన అన్నారు.
News September 16, 2025
జగిత్యాల: చిన్నారుల మహిళలకు పోషణ మహోత్సవ కార్యక్రమం

చిన్నారుల మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు సమగ్ర శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు చక్కెర, ఉప్పు, నూనెల వాడకం పరిమితిపై ప్రచార కార్యక్రమాలు జరిపించనున్నట్లు పేర్కొన్నారు.