News October 28, 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదిక 410 అర్జీలు: కలెక్టర్

గుంతకల్లులోని టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం గుంతకల్లు రెవెన్యూ డివిజన్కు సంబంధించి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి 410 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.
Similar News
News January 21, 2026
జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా వడ్డె వెంకట్ బాధ్యతల స్వీకరణ

అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా వడ్డె వెంకట్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తనకు, జిల్లా స్థాయి ఉన్నత పదవి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరించి, విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
News January 21, 2026
రైతుల పాలిట కనక వర్షంగా మారిన దానిమ్మ పంట

అనంతపురం జిల్లాలో పండిస్తున్న దానిమ్మ పంట రైతుల పాలిట కనక వర్షం కురిపిస్తోంది. కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. నేడు నాణ్యతను బట్టి టన్ను దాదాపు రూ.1.50 లక్షలకు పైగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పుట్లూరు మండలం బాలాపురంలో రైతు సుదర్శన్ రెడ్డికి చెందిన తోటలో ఒక్కో దానిమ్మ కాయ 0.830 గ్రాముల బరువు దిగుబడి రావడం విశేషం.
News January 20, 2026
ఇన్ఛార్జి కలెక్టర్కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.


